పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కోనరావుపేట మండలం బావుసాయిపేటలో గురువారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మరుపాక శంకర్(32) అనే రైతు పంట ఎండిపోయిందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. తన పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.