ఇంటి కరెంట్ బిల్లు రూ. 3,33,396
ఓ ఇంటికి కరెంటు బిల్లు రూ. 3,33,396 వేశారు విద్యుత్శాఖ అధికారులు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు శివారులోని సుభాష్నగర్కు చెందిన జన్ను లింగయ్య ఆగస్టు నెల కరెంటు వినియోగం 4,425 యూనిట్లుగా నమోదైంది. దీంతో ఆయనకు రూ.3,33,396 బిల్లు వేశారు. ఆందోళనకు గురైన లింగయ్య అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన రాలేదు. బిల్లు ఎలా కట్టాలని లింగయ్య ఆందోళన చెందుతున్నాడు.