బస్సు దొంగ అరెస్ట్
నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును దొంగిలించిన వ్యక్తిని నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఏపీ01వీ6595 నంబరు బస్సును డ్రైవర్ బస్టాండ్లో నిలిపాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ శ్రీకాంత్ ఈ బస్సును దొంగిలించుకొని వెళ్లాడు. ఆ బస్సును ఆదిలాబాద్ వైపునకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. శ్రీకాంత్ బస్సును నేరడిగొండ టోల్ప్లాజా వద్ద కూడా ఆపకపోవడంతో టోల్ప్లాజా సిబ్బంది సైతం పోలీసులకు సమాచారం అందించారు. నేరడిగొండ పోలీసులు అప్రమత్తమై శ్రీకాంత్ను గ్రామసమీపంలో అరెస్టు చేశారు.