‘రైతులకు కొత్త సాంకేతిక పద్ధతులను అందించండి’


సాక్షి, హైదరాబాద్‌: వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సుదర్శన్‌ భగత్‌ పిలుపునిచ్చారు.



భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌), వ్యవసాయ పరిశోధన నిర్వహణ జాతీయ అకాడమి (నార్మ్‌)లో శనివారం జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. దేశంలో కొన్నిచోట్ల అధిక సాగునీరు, మరికొన్నిచోట్ల నీటి కొరత ఉండటం చూస్తూనే ఉన్నామని, వ్యవసాయ రంగం ఇలా అనేక కొత్త సవాళ్లను ఎదుర్కుంటోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కొత్త సాంకేతిక పద్ధతులను అందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top