దుఃఖం తోనే పది పరీక్షకు


అదిలాబాద్: తండ్రి చనిపోయి పుట్టెడు బాధలో ఉండి కూడా పదో తరగతి విద్యార్థి పరీక్షకు హజరయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం పెద్దపేటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశ నవేని సుభాష్ స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. సుభాష్ తండ్రి శంకరయ్య అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఈ రోజే విద్యార్థికి ఆంగ్ల పరీక్ష ఉండటంతో అతను దుఃఖంతోనే హాజరయ్యాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top