గుర్రంపోడులో ఉద్రిక్తత
నల్లగొండ జిల్లా గుర్రంపోడులో మృతదేహంతో రోడ్డు పై ధర్నా నిర్వహిస్తున్నారు. స్థానికంగా నివాసముంటున్న ఇటికల శేఖర్(26) అనే యువకుడిని ఓ కేసు నిమిత్తం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన మృతుడి బంధువులు మృతదేహంతో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. బాదిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డు భీష్మించుకొని కూర్చున్నారు.