వణికిస్తున్న చలి.. తగ్గిన ఉష్ణోగ్రతలు


ఖమ్మం, నల్లగొండల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం, నల్లగొండల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top