'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'

'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు' - Sakshi


హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో కలకలం రేగింది. తెలంగాణకు సంబంధించిన టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి. మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని తెలుగు యువత అందులో డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నోటీసు బోర్డుల్లో కనిపించిన ఈ ప్రకటనలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కాస్తంత వాక్పటిమ ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు డిమాండ్ చేసి ఉండొచ్చని, లేదా కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top