అవినీతి, అక్రమాలకు తావు ఉండదు: ఈటెల

అవినీతి, అక్రమాలకు తావు ఉండదు: ఈటెల - Sakshi

కరీంనగర్: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు తావు ఉండదని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలుకు గత ప్రభుత్వాలే కారణమని ఆయన ఆరోపించారు. 2015 లో విద్యుత్ సమస్యలు లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఈటెల తెలిపారు. 

 

రేషన్ బియ్యం ధర, ఎన్ని కిలోలు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం అక్టోబర్ 4 తేదిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top