తెలంగాణకు నష్టం తప్పదు: జీవన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం తప్పదని కరీంనగర్ జిల్లా జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సరికాదని ఆయన విమర్శించారు.
విద్యుత్ సమస్యపై కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జీవన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే ముఖ్యమంత్రిలా కాకుండా ఇరు రాష్ట్రాల్లో టీడీపీ అధ్యక్షుడిలా వ్యహరించాలని సూచించారు.