సీఎంకు కనువిప్పు కలిగించేందుకు నిరసన: రేవంత్‌


ఖమ్మం: తెలంగాణ రావడానికి కేసీఆర్ కుటుంబం ఒక్కటే కారణం కాదని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించేందుకు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాల్సిన శాసన సభ అధ్వానంగా తయారు అయిందని విమర్శించారు.



గవర్నర్ వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని, గవర్నర్ సభలో వున్నప్పుడు సభ్యులపై చర్యలు తీసుకునే అర్హత స్పీకర్‌కు లేదన్నారు. ఇది తెలంగాణ సమాజానికి, రాజ్యాంగాన్ని రూపకర్త అంబేద్కర్‌కు అవమానకరమని అన్నారు. తాము తప్పు చేసి ఉంటే వీడియోలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాము తప్పు చేశామని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం​..తమ తప్పు లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top