రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత


హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టులోకి న్యాయమూర్తులు వెళ్లకుండా తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టు గేటు మూసివేసి అక్కడ బైఠాయించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


 


ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారిపై లాయర్లు కోడిగుడ్లు విసిరారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు  మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top