హైదరాబాద్లో తెలంగాణ కళాభవన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కవులు, కళాకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరికి వరాలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంతో మమేకమైన దాదాపు 500 మంది కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలను సడలించాలని నిర్ణయించారు.
ఇందిరాపార్క్ సమీపంలో 11 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ కళాభవన్ ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.