ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హోంమంత్రి


మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు సంబంధించిన పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.



అనంతరం సీసీసీ(కోల్ కెమికల్ కాంప్లెక్స్)లో పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top