వీణా-వాణిల ఆపరేషన్పై త్వరలో నిర్ణయం


హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా - వాణిల ఆపరేషన్ కు సంబంధించిన నివేదికను లండన్ వైద్యులు...హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు. లండన్ వైద్యుల నుంచి అందుకున్న ఈ నివేదికను నిలోఫర్ వైద్యులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి  అందజేశారు. ఈ మేరకు వీణా - వాణిల ఆపరేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.



వీణా-వాణీలకు దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని లండన్ వైద్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top