దసరాకు కొత్త రేషన్‌కార్డులు

దసరాకు కొత్త రేషన్‌కార్డులు - Sakshi


హైదరాబాద్: దసరా నుంచి దీపావళి మధ్య కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు గ్రామస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో భాగంగా గడపగడపకూ వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తారు. తెలంగాణ సిటిజన్ కార్డు ప్రతి కుటంబానికి రేషన్‌కార్డు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.



కాగా ప్రభుత్వ పథకాలు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. బోగస్ కార్డులు, లబ్దిదారులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందేనని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top