విద్యా సంస్కరణలకు టీ.ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవతరగతిలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి 9,10 వ తరగతుల్లో ఇంటర్నల్స్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి సబ్జెక్ట్ కు 80 మార్కులు, 20 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్నల్స్ పాస్ తప్పనిసరి కాదని, గతంలో మాదిరిగానే పదవ తరగతిలో 11 పేపర్ల విధానం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ద్వితియ భాష మినహా ప్రతి పేపర్కు 40 మార్కులు ఉంటాయని ప్రతి సబ్జెక్ట్లో 28 మార్కులు వస్తే పాస్ అయ్యే విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. గతంలో సెకండ్ లాంగ్వేజ్ లో 20 మార్కులకు పాస్ కాగా, ఇప్పుడు 35 మార్కులను పాస్గా నిర్ణయించారు. తొమ్మిది, పదోతరగతిలోనూ నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.