'టీఆర్ఎస్ ను కట్టడి చేసేలా వ్యూహం'
హైదరాబాద్: రాజకీయ వ్యభిచారాన్ని పరాకాష్టకు తీసుకెళ్లిన టీఆర్ఎస్ ను కట్టడి చేసేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ వ్యూహం ఉండబోతోందని కాంగ్రెస్ విప్ సంపత్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులతో ఆయన చర్చించారు. వ్యూహాన్ని రచించే బాధ్యతను సీనియర్ నేత కె. జానారెడ్డికి అప్పగించామని చెప్పారు.
మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంశాన్ని కూడా చర్చించామన్నారు. చిన్నారెడ్డిపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని సంపత్ డిమాండ్ చేశారు. చిన్నారెడ్డిపై దాడికి నిరసనగా సచివాలయంను ముట్టడిద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన సూచనతో జానారెడ్డి విభేదించడంతో గవర్నర్ ఫిర్యాదు చేయాలని టీసీఎల్పీ నిర్ణయించింది.