టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా పలువురు మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ అధికార నివాసంలో తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు రాజకీయ మీటింగులు పెడుతున్నారని భన్వర్లాల్ దృష్టికి తీసుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్లో చేరికలను, పాలనా కేంద్రం సచివాలయంలో నిర్వహించడంపై ఫిర్యాదు చేశారు.