నేడు కరీంనగర్ కు కేసీఆర్
కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం బృందంతో కలసి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం నుంచి కాళేశ్వరం వరకు గోదావరి, ప్రాణహిత నదులపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం కాళేశ్వరంలో దిగి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే గోదావరి ఘాట్ వద్ద పుష్కర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.