తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కేసీఆర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) తీవ్రమైన విమర్శల్ని సంధించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని, తమకు రావాల్సిన విద్యుత్ వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కేసీఆర్ ఆరోపించారు. పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 54 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. నవంబర్ 2 తేది వరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.