తెలంగాణలో రుణమాఫీపై సబ్ కమిటీ భేటీ


హైదరాబాద్ : తెలంగాణలో రుణమాఫీ అమలుపై మంత్రివర్గ ఉప సంఘం శనివారమిక్కడ సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ సర్కార్ ఉప సంఘాన్ని వేశారు. ఈ భేటీలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్,  జోగు రామన్న, మహేందర్ రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ విధివిధానాల ఖరారుపై చర్చలు జరుపుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top