నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  జరిగే భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇళ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ గృహాలు నిర్మించే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తారు.



దీనితోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, క్రమబద్ధీకరణ, ఆహార భద్రత, సచివాలయం తరలింపు, వరంగల్‌కు గ్రేటర్ హోదా, పోలీస్ కమిషనరేట్ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top