నేటితో ముగియనున్న టీ.అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రకటన చేయనున్నారు. సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక శాసనమండలి సమావేశాలు నిన్నే నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.