టవరెక్కిన యువకుడు


రంగారెడ్డి: యజమాని తిట్టడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని విద్యుత్ పోల్ ఎక్కి వీరంగం సృష్టించాడు. బుధవారం యజమాని మందలించడంతో నిజాం అనే వ్యక్తి ఆరాంఘర్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ టవరెక్కాడు.


ఫ్యాక్టరీ యజమాని, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వచ్చి తన సమస్యను తీర్చాలని అప్పటివరకు దిగిరానని మారాం చేస్తున్నాడు. అతన్ని దింపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top