ఈత నేర్చుకోవడానికెళ్లి మృత్యువాత
స్టేషన్ఘన్పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వాగు సమీపంలో ఉన్న బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన కాసాని విజయ్(14) అనే బాలుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.
దగ్గరలో ఈత వచ్చిన వారు కూడా ఎవరూ లేకపోవడంతో రక్షించేందుకు ప్రయత్నించలేకపోయారు. ప్రస్తుతం విజయ్ తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులకు విజయ్ ఒక్కడే కుమారుడు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తున్నారు.