నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం


నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం  గూడ్స్ రైలు సాంకేతిక లోపం కారణంగా పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళ్లే కాకతీయ, పుష్‌పుల్, సంపర్క్, సింహపురి తదితర రైళ్లు నిలిచిపోయాయి.


దీంతో సదరు రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల పునరుద్దరణకు మరో గంట వరకు సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

(భువనగిరి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top