టెన్త్ స్పాట్ వ్యాల్యూయేషన్ బహిష్కరించిన టీచర్లు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వైఖరిపై స్థానిక ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అందులోభాగంగా టెన్త్ స్పాట్ వ్యాల్యూయేషన్ను బుధవారం ఉపాధ్యాయులుబహిష్కరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ 27 మంది ఉపాధ్యాయులు, 18 మంది చీఫ్ సూపరింటెండ్లను జిల్లా కలెక్టర్ ఇటీవల సస్పెండ్ చేశారు. దాంతో కలెక్టర్ వైఖరిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల ఆందోళనకు టి.జేఏసీ మద్దతు ప్రకటించింది.