ఉపాధ్యాయుడి దాడిలో విరిగిన విద్యార్థి చేయి
ఖిలావరంగల్ : హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో చితకబాదగా ఆమె చేయి విరిగిన సంఘటన చింతల్లోని ఇండియన్ హైస్కూల్లో బుధవారం సాయంత్రం జరిగింది. విద్యార్థి బంధువుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన ఎలకంటి రాజు, ఇంద్ర దంపతుల కుమారుడు శివప్రసాద్ పుప్పాలగుట్టలోని ఇండియన్ హైస్కూల్ 8వ తరగతి చదువుతున్నాడు. చెప్పిన హోంవర్క్ చేయలేదని కోపగించుకున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు హరి బుధవారం సాయంత్రం కర్రతో శివప్రసాద్ను చితకబాదగా చేయి విరిగింది.
దీంతో సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని శివప్రసాద్ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విద్యార్ధిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.