2019లో టీడీపీకే పట్టం
తాండూరు: రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చెప్పా రు. అప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.25వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ఆ ఫైల్పైనే తొలి సంతకం చేస్తామన్నారు. తాండూరులో శుక్రవారం ‘టీడీపీ ప్రజాపోరు’ సభలో ఆయన మాట్లా డుతూ.. పసువు, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కంది పంటలకు గిట్టుబాటు ధర కల్పి స్తామ ని హామీ ఇచ్చారు. అమలుకు సాధ్యంకాని హామీలతో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
అయ్య అండతో కొడుకు మంత్రిగా కొనసాగుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడు తూ.. మహిళా సంఘాల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజాస్వామ్య పాలనకు పాతరేస్తూ గడీల పాలనను పునఃనిర్మాణం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ బాహుబలి కాదని.. ఆయన అమరేంద్ర బాహుబలి రాజ్యాన్ని లాగేసుకున్న భల్లాలదేవ అని టీడీపీ అధికార ప్రతినిధి అరవింద్కుమార్గౌడ్ అన్నారు. నిజమైన బాహుబలి రేవంత్రెడ్డి అన్నారు. సభలో టీడీపీ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి పలు తీర్మా నాలు చేశారు.