టీడీపీ ఆఫీస్ ను తగులబెట్టడంపై జానా ఖండన!
నల్లగొండ: తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం, అప్రజాస్వామికం అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి అన్నారు. నల్లగొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టారు.