గులాబీ గూటికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి?

గులాబీ గూటికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి? - Sakshi


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన ‘కారె’క్కే అంశంపై మంతనాలు జరిపారు.



మంగళవారం ఎలిమినేడులోని తన నివాసంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నా రు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మం చిరెడ్డి చేరిక పార్టీకి లాభం చేకూరుస్తుందని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను గందరగోళపర్చేందుకే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top