‘గ్రేటర్’ తర్వాత కాంగ్రెస్, టీడీపీ మాయం: ఈటెల
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కనుమరుగవడం ఖాయమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకే టీఆర్ఎస్ పరిమితమని హేళన చేసిన వారికి కంటోన్మెంటు ఎన్నికలు సమధానమిచ్చాయని, గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుం దన్నారు. టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ శనివారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఎప్పటికైనా టీడీపీ చూపు ఆంధ్రావైపేనని, దాన్ని గ్రహించిన ఆంజనే యులు గౌడ్ వంటి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత చంద్రబాబుకు ఇక్కడేం పని? అని ప్రశ్నించారు. గౌడ్తో పాటు 50 మంది ఎంపీటీసీలు, 50 మంది సర్పంచ్లు టీఆర్ఎస్లో చేరారు.