ఎవరి దయాదాక్షిణ్యం అక్కర్లేదు

ఎవరి దయాదాక్షిణ్యం అక్కర్లేదు - Sakshi


యాదగిరిగుట్ట: సామాజిక న్యాయం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. అది ఎవరి దయా దాక్షిణ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. మహాజన పాదయాత్రలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను విస్మ రించారని విమర్శించారు. రోజుకో మాట చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.  



  ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, పీఆర్‌ఎస్‌పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. కాగా, యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుతో జరుగుతున్న భూసేకరణకు ముందు ప్రజాభిప్రాయసేకరణను చేపట్టాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వా లని  గురువారం ఆయన సీఎంకు లేఖ రాశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top