పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది..
తమ్మినేని వీరభద్రం
కూసుమంచి: ‘ఇష్టం వచ్చినట్లు పాలించేం దుకు నీ తాత ఇచ్చిన రాష్ట్రం కాదని, పోరా టాల ద్వారా వచ్చిన తెలంగాణ అని’’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చేరింది. ఈ సందర్భంగా మల్లేపల్లిలో జరిగినసభలో తమ్మినేని మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన సాగుతోందన్నారు. పాద యాత్రను అడ్డుకోండంటూ సీఎం పిలుపుని చ్చారని, ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినం దుకు సీఎంను జైలుకు పంపొచ్చన్నారు. కాగా, సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్ర మను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్కు మంగళవారం లేఖ రాశారు.