డీఎస్సీ ప్రకటన కోసం సహకరించండి


  •  ఎంపీ కవితకు బి.ఎడ్. విద్యార్థుల విజ్ఞప్తి

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు తక్షణమే డీఎస్సీ ప్రకటన జారీ చేయించేందుకు కృషి చేయాలని బి.ఎడ్. విద్యార్థుల సంఘం నిజామాబాద్ ఎంపీ కె.కవితకు విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు అల్వాల మధుసూదన్ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఆదివారం ఆమెను కలసి ఈ మేరకు కోరారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ డిసెంబర్ 4న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top