ఆదివారం కూడా హజ్ దరఖాస్తుల స్వీకరణ


సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015 దరఖాస్తుల స్వీకరణ కోసం మార్చి 1వ తేది(ఆదివారం) కూడా హజ్‌కమిటీ కార్యాలయం పనిచేస్తుందని రాష్ట్ర హజ్‌కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఏ.షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. హజ్‌యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆదివారం కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు 15 వేల దరఖాస్తులు వచ్చాయని, అందులో రిజర్వ్‌డ్ కేటగిరీకి సంబంధించి 1358 దరఖాస్తులు ఉన్నాయన్నారు.  

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top