ఏడెకరాల్లో చెరకు పంట దగ్ధం
ఆత్మకూరు: షార్ట్ సర్క్యూట్తో చెరకు పంట దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల శివార్లలో బంగారు భాస్కర్కు చెందిన ఏడెకరాల పొలాన్ని కిష్టన్న అనే రైతు కౌలుకు తీసుకుని చెరకు పంట వేశాడు.
రెండు రోజుల్లో పంటను కోసేందుకు సిద్ధమైయ్యాడు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడెకరాల్లోని చెరకు పంట పూర్తిగా దగ్ధమైంది. పొలంలోంచి 11కేవీ విద్యుత్ లైన్ వైర్లు వెళ్లాయి. వాటి వల్ల షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా, కష్టపడి సాగు చేసిన పంట అగ్నికి దగ్థమవ్వడంతో కిష్టన్న తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యాడు.
సంబంధిత వార్తలు