'నేను ఎస్సైని... నన్నడిగేవాడెవడు'

'నేను ఎస్సైని... నన్నడిగేవాడెవడు' - Sakshi


వరంగల్: పదేళ్ల గా ఒక ఎస్సై ఒక బాలునిపై అమానుషంగా  ప్రవర్తించాడు. అతన్ని కరడుగట్టిన నేరస్థుడితో సమానంగా చూశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. జిల్లాలోని తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామానికి చెందిన గంధం వీరన్న(10) వర్ధన్నపేటలోని చిన్నారుల సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే, వసతిగృహం పక్కనే ఉన్న ఓ డబ్బాకొట్టులో వీరన్న దొంగతనం చేశాడంటూ కొందరు ఆ బాలున్ని  పోలీసులకు శనివారం సాయంత్రం అప్పగించారు. అప్పటి నుంచీ వీరన్నను ఎస్‌ఐ కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్‌లో ఉంచాడు. బాలున్ని స్టేషన్‌లో ఓ మొద్దుకు కట్టేసి ఉండడాన్ని చూసిన కొందరు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ బాలున్ని వదిలేశాడు. అయితే, ఎస్‌ఐ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(వర్ధన్నపేట)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top