పీజీ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ : ఓ కళాశాల విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన బిస్మీర్సింగ్ కుమార్తె బి.రాఖి (25) ఖైరతాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. అయితే, ఈ నెల 25న కళాశాలకు వెళ్లిన రాఖి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
(కాచిగూడ)
మరిన్ని వార్తలు