వాటర్ ట్యాంక్ ఢీకొని విద్యార్థి మృతి


హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి జాతీయరహదారిపై వాటర్ ట్యాంకు ఢీకొని రాజేష్(21) అనే విద్యార్థి మృతి చెందాడు. స్నేహితునితో కలిసి కొంపల్లిలోని సాయిచైతన్య కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజేష్ బీకాం సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంతో సంఘటనాస్థలంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top