ప్రజా సమస్యలకు ప్రత్యేక రిజిస్టర్
అధికారులను ఆదేశించిన కలెక్టర్ రఘునందన్ రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని అధికారులను కలెక్టర్ రఘునందన్ రావు ఆదేశించారు. సమస్యలను నిశితంగా పరిశీలించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా లక్డీకపూల్లోని కలెక్టరేట్లోని కోర్టు హాల్లో కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. వీటి పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో వచ్చే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి 23 దరఖాస్తులు అధికారులకు అందాయి.