కన్నవాళ్లను చంపిన తనయులు
సిరిసిల్ల క్రైం/కమలాపూర్: మద్యానికి డబ్బులు అడుగుతూ గొడవ పడుతున్నా డని ఒకరు తండ్రిని.. డబ్బులన్నీ కూతుళ్లకే ఇస్తున్నావంటూ మరొకరు తల్లిని కొట్టి చంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్కు చెందిన మేర్గు సుదర్శన్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగుడుకు డబ్బులు అడుగుతూ.. ఇంట్లో వాళ్లను నానారకాలుగా వేధిస్తున్నాడు. భరించలేని కుమా రుడు గణేశ్.. తండ్రి తలపై రాయితో బాది హత్య చేశాడు. శవాన్ని ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకొచ్చి తను నిర్మిస్తున్న ఇంటి ఎదుట పడేసి, గుర్తు తెలియని వ్యక్తుల పనిగా చిత్రీకరించేందుకు యత్నించాడు.
పోలీసుల విచారణ లో గణేశ్ హత్య చేసినట్లు గుర్తించారు. గణేశ్, అతనికి సహకరించిన స్నేహి తులు ఆకాశ్, ప్రవీణ్పై కేసు నమోదు చేశారు. కాగా, వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన నిగ్గుల రాయమల్లు, ఓదమ్మ (58)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్న కుమార్తె సుకన్య భర్త నుంచి విడాకులు తీసుకుని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే చిన్న కూతురికి ఎంతోకొంత కట్నం ఇవ్వాలని తల్లిదండ్రులు భావించి బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నారు.
విషయం తెలిసిన శంకర్(35).. ‘అన్ని డబ్బులు కూతుళ్లకే ఇస్తున్నారు.. నాకేం వద్దా’ అంటూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే వారు దాచుకున్న రూ.5 వేల నగదు, ఆభరణాలు, బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకెళ్లాడు. దీంతో వారు ఆదివారం గ్రామంలోని ఓ పెద్ద మనిషి వద్దకు శంకర్ను పిలిపించి అడిగించారు. కోపం పెంచుకున్న శంకర్ తల్లిపై చెక్కతో దాడి చేయగా, తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందు తూ మరణించింది. శంకర్పై హత్య కేసు నమోదు చేశారు.