సోనియా, ప్రియంక ఫ్లెక్సీల తొలగింపు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయ ప్రియంకా గాంధీ ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారి తీసింది. బతుకమ్మ పండుగ సంబురాల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో సోనియా, ప్రియాంక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని కార్పొరేషన్ అధికారులు తొలగించారు.
తమ నేతల ఫోటోలతో ఫ్లెక్సీలు తొలగించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా, ప్రియాంక ఫ్లెక్సీలు తొలగిస్తే బతుకమ్మ సంబురాల వద్ద నిరసన, ధర్నాలకు దిగుతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.