తండ్రిని చంపిన తనయుడు


భిక్కనూరు : తండ్రిని చంపిని తనయుడిని అరెస్టు చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు భిక్కనూరు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ హత్య వివరాలను వెల్లడించారు. మండలంలో ని అంతంపల్లి గ్రామసమీపంలోని చైతన్యనగర్ కాలనీకి చెందిన మెగావత్ కిషన్ తన కుటుంబంతో ఈనెల 19న ఎడపాయల జాతరకు వెళ్లాడు.



అక్కడ కిషన్ తప్పిపోయాడు. ఎంత వెదికినా కనిపించకపోవడంతో 20వ తేదిన ఇంటికి తిరిగివచ్చారు. ఆ తర్వాత కిషన్ కూడా ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తిరుపతి ఆగ్రహం పట్టలేక తండ్రి కిషన్‌పై కత్తితో దాడి చేయగా, వెంటనే కిషన్ కుప్పకులాడు. గుట్టుచప్పుడు కాకుండా కామారెడ్డి ఆస్పత్రికి , అక్కడి నుంచి నిజామాబాద్‌కు, ఆ తర్వాత హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 24న కిషన్ మృతిచెందాడు. దీనిపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తిరుపతిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top