ఆస్తి కోసం తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి


వరంగల్‌ రూరల్‌: వరంగల్‌ రూరల్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆస్తి తగాదాలతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన జిల్లాలోని నల్లబెల్లి మండలం గొల్లపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గాదం బొందయ్య(62), కేతమ్మ(55) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గాదెం మహిపాల్‌ గత కొన్ని రోజులుగా ఆస్తి తన పేరిట రాయమని వేధిస్తున్నాడు.

 

ఈ అంశంపై కొద్ది రోజుల క్రితమే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర కోపోద్రిక్తుడైన మహిపాల్‌ తల్లిదండ్రులు నిద్రిస్తుండగా.. గొడ్డలితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన దంపతులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో కుమారుడితో పాటు అతని భార్య బావమరుదులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top