ఖరారైన సోలార్ టెండర్లు

ఖరారైన సోలార్ టెండర్లు - Sakshi

  • రూ.6.45కు ఒక యూనిట్

  • 500 మెగావాట్లకు అంగీకారం

  • ముఖ్యకార్యదర్శుల కమిటీ తీర్మానం

  • సాక్షి, హైదరాబాద్: సోలార్ టెండర్ల రేటు ఖరారైంది. కం పెనీలు కోట్ చేసిన రేట్లలో  కనిష్ఠ ధర అయిన రూ.6.45 చొప్పున  ఒక్కొక్క యూనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ముఖ్యకార్యదర్శుల కమిటీ నిర్ణయించింది. ఆ రేటుకు సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఆహ్వానించి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.



    సోలార్ టెండర్లను ఖరారు చేసేందుకు గురువా రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో జరిగిన సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి నరసింగరావు, ఇం ధన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పాల్గొన్నారు. అదనంగా మరో 500 మెగావాట్ల కొనుగోలు చేయాలని డిస్కంల నుంచి అందిన ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్టు తెలి సింది. కానీ 500 మెగావాట్లు కొనుగోలుకు పరి మితం కావాలని, అదనంగా కొనుగోలు అంశా న్ని సీఎంకు నివేదించాలని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది.



    టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ గత నెల లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెం డర్లు పిలవగా 108 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఒక కంపెనీ యూనిట్‌కు రూ.6.45 రేటును కోట్ చేసింది. టెండర్లలో పాల్గొన్న కం పెనీలకు 1840 మెగావాట్ల సౌరవిద్యుత్ సమకూర్చే సామర్థ్యం ఉంది. 500 మెగావాట్ల విద్యు త్ కొనుగోలు చేస్తే 33 కంపెనీలకు కాంట్రాక్టు దక్కుతుంది. వెయ్యి మెగావాట్లు కొనుగోలు చేస్తే 60 కంపెనీలకు అవకాశం లభిస్తుంది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top