ఈత సరదా: ఎనిమిది మంది మృతి
శివరాత్రి రోజున తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల విషాదం నెలకొంది. మంచిర్యాలలోని హాజిపూర్ మండలం ముల్కల వద్ద గల గోదావరి తీరంలో స్నానాలకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు మంచిర్యాల పట్టణం జఫర్నగర్కు చెందిన శ్రీకాంత్, సుధాకర్లుగా గుర్తించారు.
భద్రాద్రి జిల్లా పినపాక మండలం చింతలబయ్యారంలో జరిగిన మరో ఘటనలో నలుగురు యువకులు విగత జీవులయ్యారు. శివరాత్రి స్నానానికి వెళ్లిన యువకులు నీటి వేగానికి గోదావరిలో కొట్టుకుపోయారు. మృతులను ప్రేమ్(22), నాగేందర్(20), మురళి(19), పవన్(18)లుగా గుర్తించారు.
మరో ఘటనలో హైదరాబాద్లోని శామీర్పేట చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చర్లపల్లికి చెందిన సాయి, సికింద్రాబాద్కు చెందిన విష్ణువర్దన్లుగా గుర్తించారు.