అక్కాచెల్లెలు అదృశ్యం
హైదరాబాద్: అక్కాచెల్లెలు అదృశ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన రామ్బోవి జవహర్నగర్లోని ఆర్ఏఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, కుటుంబసభ్యులతో కలిసి మల్లెలగూడలో నివసిస్తున్నారు. ఆయన పెద్ద కూతురు బిందురామ్(20) డిగ్రీ, చిన్న కూతురు రుచిత్రామ్(19) ఇంటర్ చదువుతోంది.
శుక్రవారం రామ్బోవి భార్య బంగారమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు తిరిగిరాలేదు. దీంతో రామ్బోవి తన ఉద్యోగానికి సెలవు పెట్టి కూతుళ్లను వెతుకుతున్నాడు. ఆయన సహఉద్యోగి పురన్సింగ్ శనివారం సాయంత్రం జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతుల ఆచూకీ తెలిసిన వారు 9490617140, 833298117 నంబర్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
సంబంధిత వార్తలు