వడదెబ్బతో సింగరేణి కార్మికుడు మృతి


కరీంనగర్: గోదావరిఖనిలోని విజయానగర్‌లో పిక్కల ఓదేలు(59) అనే సింగరేణి కార్మికుడు ఆదివారం వడదెబ్బతో మరణించాడు. వడదెబ్బ తగలడంతో శనివారం సింగరేణి ఏరియా ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు.  ఓదేలు సింగరేణిలోని ఆర్‌జీ-1 జీఎం ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తుండే వాడు.

(గోదావరిఖని)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top